అమరావతి: విశాఖ నగరంలో దారుణం జరిగింది. కేబుల్ ఆపరేటర్ దారుణహత్యకు గురికావడం కలకలం రేపుతుంది. విశాఖ నగరంలోని సబ్బవరం జాతీయ రహదారి పక్కన కేబుల్ ఆపరేటర్ సింహాచలం దారుణ హత్యకు గురయ్యాడు. అతడి మృతదేహం రక్తపుమడుగులో పడి ఉండడాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.
దీంతో అక్కడకు చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. దుండగులు అతడి గొంతు కోసి హతమార్చినట్లు పోలీసులు ఆధారాలు సేకరించారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు డాగ్స్క్వాడ్తో నిందితుల ఆచూకి కోసం చర్యలు ప్రారంభించారు.