అమరావతి: ఆంధ్రప్రదేశ్లో మంత్రివర్గ విస్తరణ ఉంటుందని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి వెల్లడించారు. ఏపీ వార్షిక బడ్జెట్ 2022కు ఆమోదం తెలిపేందుకు సచివాలయంలో సమావేశమైన మంత్రివర్గ సమావేశంలో జగన్ ఇవాళ సహచర మంత్రులతో చేసిన ప్రస్తావన హాట్హాట్గా మారాయి. మాకు ఇదే చివరి కేబినెట్ సమావేశమా అని పలువురు మంత్రులు నేరుగానే సీఎం ఎదుట అనుమానం వ్యక్తం చేశారు.
కొంత మంది మంత్రుల సేవలను పార్టీ కోసం వినియోగిస్తామని అందుకు సిద్ధంగా ఉండాలని సూచించారు. కొంత మంది మంత్రులను జిల్లా అధ్యక్షులుగా నియమిస్తామని, పార్టీని గెలిపించుకొని వస్తే మళ్లీ మీరే మంత్రులు కావొచ్చని స్పష్టం చేశారు. ప్రాంతం, కులాల సమీకరణల ఆధారంగా కేబినెట్ విస్తరణ ఉంటుందని జగన్ పేర్కొన్నారు. చాలా మంది ఆశావాహులున్నారని, మంత్రివర్గంలో స్థానం లేనంత మాత్రాన డిమోషన్లుగా భావించొద్దని తెలిపారు.