ఏపీలోని కర్నూలు జిల్లా దేవరగట్టులో బన్నీ ఉత్సవం ఘనంగా జరిగింది. దసరా పర్వదినాన గ్రామగుట్టపై అర్ధరాత్రి 12 గంటలకు మాళమ్మ, మల్లేశ్వరస్వామి కల్యాణం జరిపిస్తారు. ఉత్సవ విగ్రహాలను ఆలయ పరిసరాల్లో ఊరేగిస్తున్నారు.
ఆ విగ్రహాలను దక్కించుకోవడం కోసం 3 గ్రామాల ప్రజలు ఒక వర్గంగా, మరో 5 గ్రామాల ప్రజలు మరో వర్గంగా ఏర్పడి కర్రలతో తలపడతారు. దీనిని బన్నీ ఉత్సవం అంటారు.