అమరావతి : ఏపీలోని అల్లూరి జిల్లాలో దారుణం జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు దంపతులను దారుణంగా హత్యచేసిన ఘటన కలకలం రేపుతుంది. జిల్లాలోని చింతూరు మండలం రత్నాపురం గ్రామంలో ఉంటున్న దూబి రంగయ్య, ముత్తమ్మ దంపతులను దుండగులు హత్య చేశారు.
గ్రామస్థుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పరిశీలించారు. హత్యకు గల కారణాలను అడిగి తెలుసుకుంటున్నారు. గ్రామంలో కొత్త వ్యక్తుల సంచారం గురించి వాకాబు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.