అమరావతి : ఏపీలోని పల్నాడు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. సభ్య సమాజం తలదించుకునేలో ఓ మహిళపై అన్నదమ్ములిద్దరు వీడియో తీస్తూ లైంగిక దాడికి పాల్పడ్డారు. సత్తెనపల్లి సీఐ కిరణ్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. నకరికల్లు మండలంలోని ఓ గ్రామానికి చెందిన మహిళ తన భర్తతో విడాకులు తీసుసుకొని తమ ముగ్గురు కూతుళ్లతో జీవిస్తున్నది. ఈ క్రమంలో అదే గ్రామానికి చెందిన కొత్తపల్లి సుధాకర్తో సదరు మహిళకు వివాహేతర సంబంధం ఏర్పడింది.
ఈ క్రమంలో సుధాకర్ సదరు మహిళకు ఫోన్ చేసి మట్లాడే పని ఉందని ఊరి చివరికి పిలిపించుకున్నాడు. అప్పటికే తాగి ఉన్న సుధాకర్ తన సోదరుడు శ్రీనుతో కలిసి మహిళను చెట్టుకు కట్టేసి వీడియో తీస్తూ లైంగిక దాడికి పాల్పడ్డారు. ఆమె అతి కష్టంగా తప్పించుకొని పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని నిందితులిద్దరు పరారీలో ఉన్నారని సీఐ తెలిపారు. కాగా, సుధాకర్పై గతంలో ప్రేమ, పెళ్లి పేరుతో ముగ్గురు యువతుల్ని మోసగించినట్లు సమాచారం.