అమరావతి: ఆంధ్రప్రదేశ్లో అధికార పార్టీకి వ్యతిరేకంగా రాజకీయ సమీకరణలు మారుతున్నాయి. తాజా వివరాల ప్రకారం.. ఏపీ సీఎం వైఎస్ జగన్కు సొంత బావ ఐన బ్రదర్ అనిల్ పలు సంఘాల నాయకులతో సమావేశం కావడం చర్చాంశానీయంగా మారింది. ఈరోజు విజయవాడలోని ఓ హోటల్లో బీసీ, మైనారిటీ, క్రిస్టియన్ సంఘాల నేతలు అనిల్తో సమావేశమై తమ బాధలను విన్న వించుకున్నారు. ఏపీలో వైఎస్ జగన్ ప్రభుత్వం అవలంభిస్తున్న వైఖరీని తప్పుబడుతూ గోడును వెల్లబుచ్చుకున్నారు.
తమ సమస్యలు పరిష్కరిస్తారని జగన్కు ఓటేశామని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పేర్కొన్నారు. గత ఎన్నికల్లో బ్రదర్ అనిల్ చెబితే జగన్కు ఓటేశామని అన్నారు. కాని ప్రస్తుతం కనీసం సీఎంతో మాట్లాడేందుకు తమకు అనుమతి కూడా దొరకడం లేదని వాపోయారు. రాష్ట్రంలో ప్రత్యామ్నాయం కావాలని బ్రదర్ అనిల్ ను కోరామని బీసీ నేత నాగరాజు తెలిపారు. తమ సమస్యలపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు.