తిరుపతి : తిరుపతి(Tirupati) జిల్లాలోని తొండమాన్పురం శ్రీదేవి భూదేవి సమేత వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు (Brahmotsavam) మార్చి 9 నుంచి 17వ తేదీ వరకు జరుగనున్నాయి. ఒక రోజు ముందు మార్చి 8న సాయంత్రం 6 గంటలకు అంకురార్పణతో బ్రహ్మోత్సవాలకు శ్రీకారం జరుగుతుందని టీటీడీ అధికారులు (TTD Officials) వెల్లడించారు.
మార్చి 9న ఉదయం 7 నుంచి 8 గంటల మధ్య ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయని, రాత్రి శేష వాహన సేవను నిర్వహిస్తున్నామని తెలిపారు . మార్చి 10న హంస వాహనం, 11న సింహ వాహనం, 12న హనుమంత వాహనం, 13న సాయంత్రం కల్యాణోత్సవం, రాత్రి గరుడ సేవ, 14న గజవాహనం, 15న చంద్రప్రభ వాహనం, 16న ఉదయం తిరుచ్చి, రాత్రి ఆశ్వ వాహన సేవ కార్యక్రమాలు జరుగుతాయని అన్నారు. 17న చక్రస్నానం, సాయంత్రం ధ్వజావరోహణం, 18న సాయంత్రం 5.30 గంటలకు పుష్పయాగం జరగనుందని వివరించారు.
తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
తిరుమలలో భక్తుల రద్దీ(Devotees Crowd) కొనసాగుతుంది. నిన్న స్వామివారిని 64, 741 మంది భక్తులు దర్శించుకోగా 24,667 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తుల మొక్కుల ద్వారా టీటీడీ హుండీకి రూ. 3.82 కోట్లు ఆదాయం వచ్చిందని వివరించారు. మంగళవారం 20 కంపార్టుమెంట్లలో దర్శనానికి వేచియుండగా టోకెన్లు లేని భక్తులకు 14 గంటల్లో సర్వదర్శనం కలుగుతుందని పేర్కొన్నారు.