తిరుమల: శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున శ్రీవేంకటేశ్వర స్వామివారికి ఏపీ ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్రెడ్డి పట్టువస్రాలు సమర్పించారు.
ముందుగా శ్రీ బేడి ఆంజనేయస్వామివారి ఆలయం వద్దకు చేరుకున్న సీఎం జగన్మోహన్రెడ్డికి ఆలయ అర్చకులు పరివట్టం కట్టారు. అక్కడి నుంచి పట్టువస్త్రాలను తలపై ఉంచుకుని మంగళ వాయిద్యాల నడుమ ఊరేగింపుగా శ్రీవారి ఆలయానికి చేరుకుని స్వామివారికి వస్త్రాలు సమర్పించారు.
అంతకు ముందు టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు వైవీ. సుబ్బారెడ్డి, కార్యనిర్వహణాధికారి డాక్టర్ కేఎస్. జవహర్రెడ్డి, అదనపు ఈవో ఏవీ.ధర్మారెడ్డి కలిసి ముఖ్యమంత్రికి స్వాగతం పలికారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు సీఎం జగన్కు వేదాశీర్వచనం చేశారు. శ్రీవారి తీర్థప్రసాదాలు, డ్రైఫ్లవర్ టెక్నాలజీతో చేసిన స్వామివారి చిత్రపటం, కాఫీ టేబుల్బుక్ అందజేశారు.