తిరుమల : టీటీడీ పాలక మండలి చైర్మన్గా (TTD Chairman) బీఆర్ నాయుడు(BR Naidu) బుధవారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కూటమి ప్రభుత్వం టీటీడీ బోర్డు సభ్యుల జాబితాను వారం రోజుల క్రితం ప్రకటించింది. చైర్మన్తో సహా మొత్తం 25 మంది సభ్యులతో పాటు మరో నలుగురు అధికారులను ఎక్స్అఫిషియో (Ex-Officio) సభ్యులుగా నియమించిన విషయం తెలిసిందే.
ఈ సందర్భంగా నూతన చైర్మన్గా నియమితులైన బీఆర్ నాయుడు మంగళవారం రాత్రి తిరుమలకు(Tirumala) చేరుకున్నారు. చైర్మన్గా రాక సందర్భంగా ఆలయ అధికారులు స్వాగతం పలికారు. బుధవారం ఉదయం స్వామివారి దర్శనం అనంతరం చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. టీటీడీ పాలక మండలిలో ఏపీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలకు చోటు కల్పించారు.
తెలంగాణ(Telangana) లో వివిధ రంగాలకు చెందిన ఐదుగురికి, కర్ణాటకకు చెందిన ముగ్గురిని, తమిళనాడుకు చెందిన ఇద్దరిని నియమించారు. గుజరాత్, మహారాష్ట్ర నుంచి ఒక్కొక్కరికి చోటు కల్పించారు. జ్యోతుల నెహ్రూ, వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి, కోటేశ్వరావు, మల్లెల రాజశేఖర్ గౌడ్, కృష్ణమూర్తి, ఎంఎస్ రాజు, పనబాక లక్ష్మి , నర్సిరెడ్డి, సాంబశివరావు, నన్నపనేని సదాశివరావు, జంగా కృష్ణమూర్తి, ఆర్ఎన్ దర్శన్, జస్టిస్ హెచ్ఎల్ దత్ , శాంతరామ్ , రామ్మూర్తి , తమ్మిశెట్టి జానకీదేవి, బి.మహేందర్ రెడ్డి, అనుగోలు రంగశ్రీ, సుచిత్ర ఎల్లా, బూరగపు ఆనందసాయి, నరేశ్కుమార్, డాక్టర్ అదిత్ దేశాయ్, సౌరబ్ హెచ్. బోరా,బీజేపీ నాయకుడు భానుప్రకాశ్ రెడ్డిలను సభ్యులుగా నియమించారు.