అమరావతి : ఏపీలోని అల్లూరి జిల్లా డుంబ్రిగూడ మండం గోంగూడలో పిడుగుపాటుకు గురై బాలుడు మృతి చెందిన ఘటన గ్రామంలో విషాదం నింపింది . రెండు రోజులుగా జిల్లాలో వాతావరణం మేఘావృతమై పిడుగులు, మెరుపులతో కూడిన వర్షాలు పడుతున్నాయి.
ఇవాళ కూడా వర్షం పడడంతో పొలంలో ఉన్న రైతు కుటుంబం చెట్టుకిందకు వెళ్లింది. అదే సమయంలో చెట్టుపై పిడుగుపడడంతో బాలుడు మృతి చెందగా నలుగురికి గాయాలయ్యాయి. వీరిలో దంపతులు ఇద్దరు పిల్లలు అపస్మారక స్థితిలోకి వెళ్లారు.