విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్కు వచ్చే రైళ్లకు బాంబు బెదిరింపులు వచ్చాయి. గుర్తు తెలియని వ్యక్తి డయల్ 100 కి ఫోన్ చేయడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. ఈ సమాచారం అందుకోవడంతో రైల్వే పోలీసులు రంగంలోకి దిగారు. తనిఖీలు చేపట్టారు. కాజీపేటలో ఎల్టీటీ, చర్లపల్లి వద్ద కోణార్క్ రైల్ను నిలిపేసి, తనిఖీలు చేశారు. తనిఖీల్లో ఏమీ దొరక్కపోవడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు.
తర్వాత ఈ కాల్ ఫేక్ కాల్ అని పోలీసులు ఓ నిర్ధారణకు వచ్చారు. భువనేశ్వర్ నుంచి ముంబై వెళ్తున్న కోణార్క్ ఎక్స్ప్రెస్, విశాఖ నుంచి ముంబై వెళ్తున్న ఎల్టీటీ రైళ్లలో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. పోలీసుల తనిఖీలు, జాగిలాలు, హడావుడి… ఇదంతా చూడంతో ప్రయాణికులు తీవ్ర హైరానా పడ్డారు. ఎలాంటి బాంబూ లేదని పోలీసులు తెలపడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.