అమరావతి : పశ్చిమగోదావరి జిల్లాలో సీఎం జగన్ పర్యటనకు ముందురోజు బాంబు పేలుడు తీవ్ర కలకలం రేపింది. భీమవరం-ఉండి రహదారి వెంట ఆవు మేత మేస్తుండగా బాంబు పేలింది. పేలుడు ధాటికి ఆవు తీవ్రంగా గాయపడింది. శనివారం సీఎం జగన్ భీమవరంలో పర్యటించనుండగా.. బాంబు పేలడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. పేలుడు జరిగిన పరిసర ప్రాంతాలను జల్లెడ పడుతున్నారు. పేలింది నాటుబాంబా లేక వేరేదా.? అన్నదానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.