అమరావతి : ఆంధ్రప్రదేశ్లో ఎన్నడూ లేనివిధంగా ప్రభుత్వమే బోగస్ ఓట్లను నమోదు చేయించడం తన రాజకీయ జీవతంలో మొట్టమొదటిసారి చూస్తున్నానని టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు(Chandrababu ) ఆరోపించారు. సోమవారం చంద్రగిరిలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్నికల జాబితా పేర్ల నమోదులో ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతుందని విమర్శించారు.
అధికారుల వద్ద ఉండాల్సిన లాగిన్, పాస్వర్డ్లు వైసీపీ నాయకుల వద్దకు ఎలా వస్తున్నాయని, దీంతో ఇష్టారీతిన బోగస్ ఓటర్లను నమోదు చేశారని ఆరోపించారు. వీటిపై ఎలక్షన్ కమిషన్కు ఫిర్యాదు చేయడంతో ఏపీ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారని తెలిపారు. ‘చంద్రగిరిలో 28వేల ఓట్లను తొలగించారు. 13వేలకు పైగా ఓట్లు ఒకే ఫోటోతో ఉన్నాయి.
పుంగనూరు, నగరి, తిరుపతి, చంద్రగిరి సహా పలు నియోజకవర్గాల్లో దొంగ ఓట్లను నమోదు చేశారని పేర్కొన్నారు. దొంగ ఓట్ల కేసును ఈసీ కేసు స్టడీగా నమోదు చేసుకోవాలని సూచించారు. ఏపీలో మనీ పవర్, భూ కబ్జాలు, దోపిడీకి పాల్పడుతున్న ప్రభుత్వానికి ప్రజలు తగిన బుద్ధి చెప్పాలని నిర్ణయించుకున్నారని తెలిపారు. అధికారులు చట్టపరంగా పనులు చేయాలని, లేకపోతే బోన్ ఎక్కిస్తామని హెచ్చరించారు. అధికార వైసీపీ బోగస్ ఓట్ల నమోదుపై న్యాయపరంగా పోరాడుతామని చంద్రబాబు వెల్లడించారు.
Andhra Pradesh, TDP Cheif, Chandra Babu, Bogus Votes, Election commiision, Complaint, Login and Password