అమరావతి : సరదాగా ఈతకు వెళ్లిన చిన్నారుల్లో ఐదుగురు కృష్ణా నదిలో దిగి గల్లంతైన ఘటన వారి కుటుంబాల్లో తీరని విషాదం నింపింది. పటమటకు చెందిన ఏడుగురు చిన్నారులు నిన్న సాయంత్రం కృష్ణానదిలో ఈతకు వెళ్లారు. వీరు స్నానం చేస్తుండగా ప్రవాహానికి ఒక్కొక్కరు కొట్టుకుపోగా ఒకరు క్షేమంగా ఒడ్డుకుచేరగా ఒకరిని స్థానిక జాలరులు రక్షించారు.
మిగత ఐదుగురు గల్లంతు కావడంతో పోలీసులు జాలర్ల సహాయంతో గాలింపు చర్యలు చేపట్టారు. నిన్న రాత్రి కామేశ్, గుణశేఖర్ మృతదేహాలు లభ్యం కాగా చీకటిపడడంతో గాలింపు చర్యలు నిలిపివేశారు. అధికారులు శనివారం ఉదయం గాలింపు చర్యలను తిరిగి ప్రారంభించారు. కొద్దిసేపటి అనంతరం బాలు, బాజి, హుస్సేన్ మృతదేహాలు లభ్యం కావడంతో వీటిని విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు.