విజయవాడ : (Sajjala Coments) పెట్రోల్, డీజిల్ ధరలను ఇబ్బడిముబ్బడిగా పెంచుతున్న కేంద్రం.. లాభాలను తీసుకుని పాపాలను రాష్ట్రాలకు అంటగడుతున్నదని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి దుయ్యబట్టారు. రకరకాల పన్నుల పేరుతో రాష్ట్రాలకు వాటా రాకుండా చేస్తున్నదని బీజేపీ ప్రభుత్వంపై మండిపడ్డారు. కేంద్రం బాధలు కేంద్రానికి ఉన్నా.. రాష్ట్రాల బాధలు కూడా పట్టించుకోవాలి కదా అని చమత్కరించారు. పెట్రోల్ ధరలపై బీజేపీ అవాస్తవాలను ప్రచారం చేస్తూ పబ్బం గడుపుకుంటున్నాయని విమర్శించారు. పెట్రోల్, డీజిల్ ధరలపై వాస్తవాలు ఇవీ అని ఏపీ ప్రభుత్వం ఇప్పటికే పబ్లిక్ ప్రకటన ఇచ్చిన విషయాన్ని సజ్జల గుర్తుచేశారు. సోమవారం సాయంత్రం ఆయన మీడియాతో మాట్లాడారు.
పెట్రోల్పై కేంద్రం రూ.3.35 లక్షల కోట్లు వసూలు చేసిందని, దీనిలో ఎక్సైజ్ డ్యూటీ కేవలం రూ.47,500 కోట్లుగా ఉన్నాయన్నారు. ఇందులో అన్ని రాష్ట్రాలకు కలిపి వచ్చింది కేవలం రై.19,475 కోట్లని తెలిపారు. రాష్ట్రాలకు ఇవ్వాల్సింది పోగా మిగిలిన రూ.3,15,525 కోట్లు కేంద్రం తన ఖజానాకు చేర్చకున్నదని వెల్లడించారు. రాష్ట్రాలకు వాటా రాకుండా రకరకాల పన్నులను వడ్డిస్తూ.. పెట్రోల్, డీజిల్పై కేంద్రం ఆదాయం పొందడం వంచన కిందకే వస్తుందని అన్నారు. పెట్రోల్ ధరలు భారీగా పెంచి మార్కెట్లలో డిస్కౌంట్ సేల్ పెట్టిన మాదిరిగా రూ.5, రూ.10 తగ్గించారని చెప్పారు. మేం తగ్గించాం.. మీరు కూడా తగ్గించండి అని రాష్ట్రాల మీద పడితే ఏం చేయాలి? అని ఆయన ప్రశ్నించారు. పెట్రోల్పై ఆదాయం లాక్కుంటున్న కేంద్ర ప్రభుత్వం.. ఆ పాపం, నేరాన్ని రాష్ట్రాల మీద మోపాలని చూడటం ఘోరమని సజ్జల అన్నారు.
అక్కడ మొబైల్స్ కొట్టేస్తున్నరు.. ఇక్కడ అమ్మేస్తున్నరు..
5200 అడుగుల ఎత్తులో ఉన్న ఈ గ్రామానికే రెండే దారులు..
కొత్తగా పెళ్లయిందా? ఈ ఏడింటినీ దాటేస్తే అంతా ఆనందమే
శీతాకాలంలో డైట్లో ఆవపిండి చేర్చుకోండి.. ఆరోగ్యంగా ఉండండి!
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..