హైదరాబాద్, జూన్ 22 (నమస్తే తెలంగాణ): ఆర్టీసీని ప్రభుత్వంలో వి లీనం చేసే విషయంలో ప్రభుత్వ తీరుపై కార్మికలోకం రగిలిపోతున్నదని ఆర్టీసీ కార్మిక జేఏసీ హెచ్చరించిం ది. ఎన్నికలు వద్దు.. విలీనం చేయాలని కోరుతుంటే ప్రభుత్వం ఏకపక్షంగా ఎన్నికలకు వెళ్ల డం దారుణమని అన్నారు. సో మవారం జేఏసీ నుంచి బహిరంగ లేఖ విడుదల చేశారు. ‘అధికారంలోకి వస్తే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని కాంగ్రె స్ చెప్పింది. ఏప్రిల్ 24న చర్చల సందర్భంగా విలీనం చేయడానికి సర్కార్ అంగీకరించింది. అన్ని కార్మిక సంఘా లూ ముందు విలీనమే కావాలని వినతిపత్రాలు కూడా ఇచ్చాయి. కానీ నేటివర కు విలీనం అంశంపై ఎలాంటి చర్యలు చేపట్టకపోగా, ముందు ఎలక్షన్లు జరుపాలని అధికారులు ప్రయత్నాలు చేస్తుండడంతో కార్మికుల్లో తీవ్ర అసంతృప్తి నెలకొన్నది.’ అని చైర్మన్ ఈ దురు వెంకన్న, వైస్చైర్మన్ ఎం థామస్రెడ్డి, కన్వీనర్ ఎండీ మౌలానా, కో కన్వీనర్లు కత్తుల యాదయ్య, సుద్దాల సురేశ్, బీ యాదగిరి లేఖలో కోరారు.