అమరావతి : ఏపీ దేవాదాయ శాఖ కమిషనర్ ఆదేశాల మేరకు చిత్తూరు జిల్లా కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో సేవా టిక్కెట్ల ధరలను ఆలయ నిర్వాహకులు పెంచారు. దీనికి వ్యతిరేకంగా బీజేపీ నాయకులు నిరసన చేపట్టారు. గణపతి హోమం రూ. 500 నుంచి రూ. వెయ్యి కి పెంచారు. కొత్తగా రూ. 2వేలతో ప్రత్యేక గణపతి హోమం, స్వామివారి శీఘ్రదర్శనం టికెట్ ధర రూ. 51 నుంచి రూ. 100 లకు పెంచారు.
అతి శీఘ్ర దర్శనం రూ. 100 నుంచి రూ. 150 లకు పెంచి నిన్నటి నుంచి అమల్లోకి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ భక్తులకు స్వామివారి దర్శనం భారంగా మారుతుందని ఆరోపించారు. పెంచిన ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. ఆలయంలో అక్రమంగా ఉద్యోగాలను భర్తీ చేయడాన్ని తప్పుబట్టారు.