అమరావతి : కేంద్రంలోని బీజేపీ సర్కారు (BJP Government) గత పదేండ్లుగా ఏపీ ప్రజలను మోసం చేస్తూనే ఉందని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల (YS Sharmila) ఆరోపించారు. ఇచ్చిన హామీలను ఏ ఒక్కటిని నెరవేర్చకపోవడం ప్రజలంతా నిరాశలో ఉన్నారని పేర్కొన్నారు. విజయవాడలోని పార్టీ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. ప్రత్యేక హోదా(Special status) గురించి వైసీపీ ప్రభుత్వం కేంద్రాన్ని, స్వార్థంతో నిలదీయకపోయిందని విమర్శించారు.
ప్రత్యేక హోదా వచ్చిన రాష్ట్రాలకు పరిశ్రమలు వస్తాయని, తద్వారా యువత ఉద్యోగ అవకాశాలు పొందుతారని అన్నారు. ఏపీని హార్డ్ వేర్ హబ్గా మారుస్తామని, చమురు రిఫైనరీలు ఇస్తామని ప్రధాని మోదీ(Prime Minister Modi) ఇచ్చిన హామీని ఆమె గుర్తు చేశారు. వైసీపీ ప్రభుత్వం మెగా డీఎస్సీ అంటూ దగా చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రత్యేక హోదా, పోలవరం, రాజధాని, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ నిలిపివేత లాంటి నిర్ణయాల అమలుకు కాంగ్రెస్ అధికారంలోకి రావాలని అన్నారు. మార్చి 1న తిరుపతిలో జరుగనున్న బహిరంగ సభలో ఏపీకి ప్రత్యేక హోదా డిక్లరేషన్ ఇస్తామని షర్మిల తెలిపారు.