తిరుపతి : అజాగ్రత్తలతో మనుషుల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. ముఖ్యంగా సెల్ఫోన్తో ప్రమాదాలను కొనితెచ్చుకుంటున్నారు. తాజాగా బీహర్కు చెందిన ఓ యువకుడు శ్రీకాళహస్తి మండలం చెర్లోపల్లి రైల్వే గేట్ వద్ద సెల్ఫోన్ ఇయర్ ఫోన్స్లో పాటలింటూ రైలు పట్టాలు దాటుతుండగా రైలు వచ్చి ఢీ కొట్టింది. రైలు వచ్చే శబ్ధాన్ని వినకుండా, సెల్ఫోన్లో వచ్చే పాటలతో పరిసర ప్రాంతాలను సైతం మరిచిపోవడంతో ఆ యువకుడు ప్రమాదవాశాత్తు రైలు కింద పడి మృతి చెందాడు. రైల్వే పోలీసులు సంఘట స్థలానికి చేరుకుని మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేశారు.