తిరుమల : తిరుమల( Tirumala) శ్రీవారి ఆలయంలో భాష్యకారుల ఉత్సవం ఆదివారం ఘనంగా ప్రారంభమైంది. 19 రోజుల పాటు కొనసాగే ఉత్సవాల మొదటి రోజున శ్రీవారి ఆలయంలో శ్రీ రామానుజులవారిని బంగారు తిరుచ్చిపై ఆలయ నాలుగు మాడ వీధుల్లో(Mada streets) ఊరేగింపు నిర్వహించారు. ఈ సందర్భంగా జీయ్యంగార్లు దివ్యప్రబంధ గోష్టి చేపట్టారు.
భగవద్ రామానుజులు విశిష్టాద్వైత సిద్ధాంతపరంగా మీమాంస గ్రంథానికి ‘శ్రీభాష్యం’ పేరుతో వ్యాఖ్యానం చేశారు. అందుకే భాష్యకారులుగా పేరొందారు. శ్రీరామానుజులవారు జన్మించిన అరుద్ర నక్షత్రాన్ని పురస్కరించుకుని ప్రతి ఏడాదీ శ్రీవారి ఆలయంలో భాష్యకార్ల సాత్తుమొర నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో తిరుమల పెద్దజీయర్స్వామి, తిరుమల చిన్నజీయర్స్వామి, పార్పత్తేదార్ ఉమామహేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు.