అమరావతి : ఏపీ అధికార భాషా సంఘం మాజీ అధ్యక్షుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ మరోసారి టీడీపీ అధినేత చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. ఎన్టీఆర్కు భారత రత్న అడ్డుకుంది చంద్రబాబే అని దానికి తానే ప్రత్యక్ష సాక్షినని పేర్కొన్నారు. టీడీపీ హయాంలో గన్నవరం ఎయిర్పోర్టుకు ఎన్టీఆర్ పేరు ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు. వర్సిటీకి పేరు మార్పుపై లక్ష్మీపార్వతి వ్యాఖ్యలు సొంత అభిప్రాయమని వెల్లడించారు.
శంషా బాద్ ఎయిర్పోర్టు డొమెస్టిక్ టెర్మినల్కు ఎన్టీఆర్ పేరు పెట్టాలని ఆదేశాలు వచ్చాయని టీడీపీ హయాంలో పేరు ఎందుకు పెట్టలేదని అన్నారు. యూనివర్సిటీ పేరు మార్చిన రోజే మూడు పదవులకు రాజీనామా చేశానని వెల్లడిం చారు. తెలుగు భాషకు సేవను కొనసాగిస్తానని రాజీనామాపై వెనకడుగులేదని స్పష్టం చేశారు. నా దృష్టిలో సీఎం జగన్ హీరో అని కొనియాడారు. ఆయన చేసే పనులు కొందరికి నచ్చక పోవచ్చని పేర్కొన్నారు. కుల ద్రోహి, తెలుగు ద్రోహి అని నన్ను తిడుతున్నారని తెలిపారు. తెలుగు గంగకు ఎన్టీఆర్ పేరును వైఎస్ పెట్టారని గుర్తు చేశారు.