తిరుమల: టీటీడీ ఎస్వీ అన్న ప్రసాదం ట్రస్ట్ కు భారత్ బయోటెక్ సంస్థ అధినేత కృష్ణ ఎల్లా రూ 2 కోట్ల విరాళం అందించారు. గురువారం తెల్లవారుజామున శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దర్శనం అనంతరం ఆయన సతీమణితోకలిసి రంగనాయక మండపంలో డొనేషన్ కు సంబంధించిన డీడీ ని టీటీడీ ఛైర్మన్ సుబ్బారెడ్డి, ఈవో కెఎస్ జవహర్ రెడ్డి కి అందించారు.