అమరావతి : అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మున్సిపల్ పరిధిలోని ముదిగల్లు సమీపంలో ఎలుగుబంటి
అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. గమనించిన గ్రామస్థులు అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు మృతి చెందిన ఎలుగుబంటిని పరిశీలించారు.
విషపూరిత ఆహారం తినడం వల్లే మృతి చెంది ఉంటుందని అనుమానం వ్యక్తం చేశారు. పూర్తి స్థాయి వివరాలను తెలుసుకునేందుకు పోస్టుమార్టం నివేదిక అనంతరం వెల్లడిస్తామని వారు పేర్కొన్నారు.