CM Jagan | హైదరాబాద్, డిసెంబర్ 14 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ఎన్నికల సమయంలో సత్వంత్ర అభ్యర్థిగా పోటీ చేసి రాష్ట్రవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న బర్రెలక్క.. ఇప్పుడు ఏపీ రాజకీయాల్లోనూ హాట్ టాపిక్గా మారుతున్నది. జనసేన అధినేత పవన్ మీద విమర్శలు గుప్పించేందుకు వైసీపీ నేతలు బర్రెలక్కను ప్రధాన ఆయుధంగా వాడుతున్నారు. తాజాగా సాక్షాత్తూ.. ఏపీ సీఎం జగన్ నోటి నుంచి బర్రెలక్క పేరు వినిపించింది.
పలాస బహిరంగ సభలో పవన్పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించిన సీఎం జగన్.. బర్రెలక్కను ప్రస్తావించారు. తెలంగాణ ఎన్నికల్లో పవన్ నాయకత్వంలోని జనసేన పార్టీ పోటీ చేసిందని, కనీసం స్వతంత్ర అభ్యర్థి బర్రెలక్కకు వచ్చినన్ని ఓట్లు కూడా జనసేన తెచ్చుకోలేకపోయిందంటూ ఎద్దేవా చేశారు. దత్తపుత్రుడిని యాక్టర్గా పెట్టుకుని చంద్రబాబు డ్రామాలు ఆడుతున్నారన్న జగన్.. తెలంగాణలో దత్తపుత్రుడు పోటీపడితే ఏం జరిగిందో అందరికీ తెలుసంటూ వ్యాఖ్యానించారు.