తిరుమల : లోక కల్యాణార్థం శ్రీవారిని ప్రార్థిస్తూ తిరుమల (Tirumala) నాదనీరాజనం వేదికపై ఆదివారం నిర్వహించిన 7వ విడత అయోధ్యా కాండ అఖండ పారాయణం( Ayodhyakanda Akhanda Parayanam) తో తిరుమలగిరులు మార్మోగాయి. ఇందులో 22 నుంచి 25వ సర్గల వరకు గల 155 శ్లోకాలను పండితులు పారాయణం చేశారు. యోగవాసిష్టం, ధన్వంతరి మహామంత్రం 25 శ్లోకాల పారాయణతో భక్తులు భక్తిభావంతో పులకరించిపోయారు. ధర్మగిరి వేద విజ్ఞానపీఠానికి చెందిన పండితులు (Scholars) శేషాచార్యులు, అనంత, మారుతి శ్లోక పారాయణం చేశారు.
అఖండ పారాయణంలో ధర్మగిరి వేద పాఠశాల, ఎస్వీ వేద విశ్వవిద్యాలయం అధ్యాపకులు, ఎస్వీ ఉన్నత వేద అధ్యాయన సంస్థకు చెందిన వేద పారాయణదారులు, రాష్ట్రీయ సంస్కృత విశ్వవిద్యాలయానికి చెందిన పండితులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హైదరాబాదుకు చెందిన నాగరాజు బృందం రామనామ సంకీర్తనను కార్యక్రమ ప్రారంభంలో, అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు రఘునాథ్ బృందం ‘ పాహిరామ ప్రభో, పాహిరామ ప్రభో’ సంకీర్తనను ఆలపించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ అధికారులు, పండితులు, భక్తులు పాల్గొన్నారు.