Machilipatnam | మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి వైసీపీని వీడి జనసేనలో చేరడంతో ఆ స్థానం నుంచి ఎవరు పోటీ చేస్తారనే ఉత్కంఠ ఏర్పడింది. అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేశ్బాబును మచిలీపట్నం నుంచి లోక్సభ అభ్యర్థిగా బరిలోకి దించాలని జగన్ యోచిస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో సోమవారం అవనిగడ్డలో మీడియాతో మాట్లాడిన రమేశ్బాబు దీనిపై స్పందించారు.
మచిలీపట్నం నుంచి తాను ఎంపీగా పోటీచేస్తాననే ప్రచారం జరుగుతోందని రమేశ్బాబు అన్నారు. తాను జగన్ గీసిన గీతను దాటను అని.. ఆయన ఆదేశిస్తే ఎంపీగా పోటీ చేస్తానని చెప్పారు. ఎమ్మెల్యేగా పోటీచేయమని అడిగితే ఎమ్మెల్యేగానే పోటీ చేస్తానని తెలిపారు. నాకంటే మంచి అభ్యర్థి ఉన్నారు ఆగమని అంటే ఆగుతా.. వారి వెంట ఉంటానని స్పష్టం చేశారు. అధిష్ఠానం నిర్ణయాన్ని గౌరవిస్తానని చెప్పారు. జగన్ ఏది చెబితే అది చేస్తాను తప్ప వేరే ఆలోచన తనకు ఉండదని తెలిపారు. చివరివరకు జగన్ వెంటనే తన ప్రయాణమని స్పష్టం చేశారు.