తిరుపతి : తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండో రోజు గురువారం చిన్నశేష వాహనంపై స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా ఆలయ నాలుగు మాడ వీధుల్లో వాహనసేవను వైభవంగా నిర్వహించారు. అనంతరం కల్యాణ మండపంలో శ్రీసీతా లక్ష్మణ సమేత శ్రీ కోదండ రామస్వామివారి ఉత్సవర్లకు శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీళ్లు, పసుపు, చందనంలతో అభిషేకం చేశారు.
వాహనసేవలో శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్న జీయర్స్వామి, ఆలయ ప్రత్యేక శ్రేణి డిప్యూటీ ఈవో పార్వతి, ఏఈవో దుర్గరాజు, కంకణబట్టార్ ఆనందకుమార్ దీక్షితులు, సూపరింటెండెంట్ రమేశ్, భక్తులు పాల్గొన్నారు. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించారు.