అమరావతి : చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిని శిక్షించాల్సిన పోలీసులే పేకాట ఆడుతూ పట్టుబడిన వైనం నంద్యాల జిల్లా బనగానపల్లె లో చోటు చేసుకుంది. బనగానేపల్లెలోని పేకాట శిబిరంలో కొంతమంది పేకాట ఆడుతున్నారని సమాచారం అందుకున్న ప్రత్యేక పోలీసులు పేకాట శిబిరంపై దాడులు చేశారు.
ఈ దాడిలో పేకాట ఆడుతున్న నందివర్గం పోలీస్స్టేషన్లో పనిచేస్తున్న ఏఎస్ఐ యువరాజ్, కొలిమిగుండ్ల పీఎస్ హెడ్కానిస్టేబుల్ సుబ్బారాయుడు పోలీసులకు పట్టుబడ్డారు. పేకాట నిర్వాహకుడు శివనాగిరెడ్డితో పాటు మరో 8 మందిని అరెస్ట్ చేసి వీరి వద్ద నుంచి రూ. 79,540 వేల నగదునుస్వాధీనం చేసుకున్నారు.