అమరావతి : ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలలో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్గా ఉన్న హైదరాబాద్కు చెందిన సుంకర ప్రసాద్ నాయుడును అనంతపురం జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు . అతనితోపాటు మరో 15 మందిని అరెస్టు చేసి వారి వద్ద నుంచి ఒక ఫిస్టోల్, 16 తుటాలు, స్కార్పియో, ఇటీయాస్, బుల్లెట్, వాహనాలతో పాటు రూ. 6.50 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నామని జిల్లా ఎస్పీ ఫక్కిరప్ప మీడియా సమావేశంలో వెల్లడించారు.
ఈనెల 20న గుంతకల్లుకు చెందిన ఆకుల వ్యాపారి వెంకటేశ్ కిడ్నాప్ కేసులో గుంతకల్లు పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి సుంకర ప్రసాద్ నాయుడుని డోన్ సమీపంలోని ఓబుళాపురంపై మిట్ట వద్ద అరెస్ట్ చేసినట్లు చెప్పారు. ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలలో గత కొన్నేళ్లుగా హత్యలు, కిడ్నాపులు, బలవంతపు వసూళ్లు, దొంగతనాలకు పాల్పడ్డారని వివరించారు.
రెండు దశాబ్దాలకు పైగా నేర చరిత్ర ఉన్న సుంకర ప్రసాద్ నాయుడిపై రెండు తెలుగు రాష్ట్రాలలో ఇప్పటి వరకు 11 కేసులు నమోదు అయ్యాయని వెల్లడించారు. గత నెల 29 న స్వామీజీ ముత్యాల గంగరాజును కిడ్నాప్ చేసి రూ. 24 లక్షలు డిమాండ్ చేసి వసూలు చేశాడని ఎస్పీ వివరించారు. సుంకర ప్రసాద్ నాయుడి ముఠాను చాకచక్యంగా పట్టుకున్న గుంతకల్లు డీఎస్పీ బృందాన్ని అభినందించారు.