హైదరాబాద్ : దసరా పండుగ నేపథ్యంలో అదనపు బస్సులు నడపాలని ఏపీఎస్ ఆర్టీసీ నిర్ణయించింది. విజయవాడ నుంచి పలు ప్రాంతాలకు 1,081 అదనపు బస్సులు నడుపనున్నట్లు అధికారులు ప్రకటించారు. ఈ నెల 29 నుంచి వచ్చే నెల 10వ తేదీ వరకు ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉండనున్నాయి.
విజయవాడ నుంచి హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, విశాఖ, రాజమహేంద్రవరం, కాకినాడ, తిరుపతి, అమలాపురం, భద్రాచలం ఏరియాలకు ప్రత్యేక బస్సులను నడపనున్నారు. ఈ ప్రత్యేక బస్సుల్లోనూ సాధారణ ఛార్జీలే వసూలు చేయాలని అధికారులు నిర్ణయించారు. ప్రత్యేక బస్సుల్లో రిజర్వేషన్ సదుపాయం కూడా కల్పించారు. ఏపీఎస్ ఆర్టీసీ వెబ్సైట్లో ప్రత్యేక బస్సుల వివరాలను అధికారులు అందుబాటులో ఉంచారు.