APPSC | హైదరాబాద్, డిసెంబర్ 16 (నమస్తే తెలంగాణ): ఆంధ్రప్రదేశ్లోని వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న గ్రూప్-2 పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసింది. మొత్తం 897 పోస్టులను భర్తీ చేయనున్నట్టు కమిషన్ వెల్లడించింది. ఈ నెల 21 నుంచి జనవరి 10 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించనున్నట్టు తెలిపింది. 331 ఎగ్జిక్యూటివ్, 566 నాన్ ఎగ్జిక్యూటివ్ ఖాళీలు ఉన్నాయని నోటిఫికేషన్లో పేర్కొన్నది.
రాష్ట్రవ్యాప్తంగా ఖాళీగా ఉన్న 81 గ్రూప్-1 పోస్టుల భర్తీకి సైతం ఏపీపీఎస్సీ ప్రకటన జారీ చేసింది. జనవరి 1 నుంచి 21 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. గ్రూప్-1 ప్రాథమిక పరీక్షను ఆబ్జెక్టివ్ పద్ధతిలో మార్చి 17న ఆఫ్లైన్లో నిర్వహించనుండగా, మెయిన్స్ పరీక్ష తేదీని త్వరలో ప్రకటించనున్నారు.