అమరావతి : రెవెన్యూ, దేవాదాయ విభాగాల్లో 730 పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) ప్రకటన విడుదల చేసింది. కమిషన్ సెక్రటరీ పి.ఎస్.ఆర్. ఆంజనేయులు ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. దేవాదాయ శాఖలో 670 జూనియర్ అసిస్టెంట్, కంప్యూటర్ అసిస్టెంట్ పోస్టులు, రెవెన్యూ శాఖలో 60 ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసిందని తెలిపారు. డిసెంబర్ 30 నుంచి జనవరి 19, 2022 వరకు దరఖాస్తులు సమర్పించాలని ఆయన సూచించారు.
మొత్తం పోస్టుల సంఖ్య: 730, జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్ (రెవెన్యూ డిపార్ట్మెంట్): 670 అర్హత: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. జిల్లా కలెక్టర్ నిర్వహించే కంప్యూటర్ ప్రొఫిషియన్సీ పరీక్ష ఉత్తీర్ణులై ఉండాలి.
వయస్సు: 18 – 42 సంవత్సరాలు. ఎంపిక విధానం: ఎంపిక ప్రక్రియ రాత పరీక్ష (స్క్రీనింగ్ టెస్ట్, మెయిన్ ఎగ్జామినేషన్) కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఆధారంగా ఉంటుంది. పోస్టు: ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రేడ్-3 (ఎండోమెంట్స్ సబ్ సర్వీస్): 60 అర్హత: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. వయస్సు: 18-42 సంవత్సరాలు. ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష (స్క్రీనింగ్ టెస్ట్, మెయిన్ ఎగ్జామినేషన్) కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఆధారంగా ఉంటుంది. మరిన్ని వివరాలకు https://psc.ap.gov.in వెబ్సైట్లో చూడొచ్చు.