అమరావతి : సార్వత్రిక ఎన్నికల దృష్ట్రా కేంద్ర ఎన్నికల సంఘం ఆంధ్రప్రదేశ్కు మరో ముగ్గురు ఎన్నికల ప్రత్యేక అబ్జర్వర్లను (Special observers) నియమించింది . ఏపీలో ఉన్న ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా ముందు జాగ్రత్తగా ఈ నిర్ణయం తీసుకుంది.
దేశవ్యాప్తంగా ఎన్నికల షెడ్యూల్ (Election schedule) వెలువడ్డ వెంటనే అమలులోకి వచ్చిన కోడ్ను ఏపీలో పలు పార్టీలు ఉల్లంఘించాయని ఫిర్యాదులు వెళ్లాయి. పరస్పరం దాడులు, హత్యలు, హింసాత్మక ఘటనలు చోటు చేసుకోవడాన్ని తీవ్రంగా పరిగణించి కేంద్ర ఎన్నికల సంఘం ఏపీకి ముగ్గురిని ప్రత్యేక పరిశీలకులుగా నియమించింది.
ప్రత్యేక పోలీసు అబ్జర్వర్గా దీపక్ మిశ్రా (Deepal Misra) , ప్రత్యేక సాధారణ ఎన్నికల అబ్జర్వర్గా రామ్ మోహన్ మిశ్రా, ప్రత్యేక ఎన్నికల వ్యయ అబ్జర్వర్(Election Expenditure Observer) గా నీనా నిగమ్లను నియమించింది. ఈ ముగ్గురు వచ్చేవారం ఏపీలో విస్తృతంగా పర్యటించనున్నారు.