అమరావతి : ఆంధ్రప్రదేశ్లో కొత్తగా ఏర్పాటైన జిల్లాలకు కలెక్టర్లను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కొన్ని జిల్లాలకు పాతవారినే కొనసాగిస్తుంది . శ్రీకాకుళం జిల్లా కలెక్టర్గా శ్రీకేశ్ బాలాజీరావు, విజయనగరం కలెక్టర్గా సూర్యకుమారి, విశాఖ జిల్లా కలెక్టర్గా మల్లికార్జున యథాస్థానంలో కొనసాగిస్తుంది. కొత్త జిల్లా మన్యంకు కలెక్టర్గా నిశాంత్ కుమార్,అనకాపల్లి జిల్లా కలెక్టర్గా రవిసుభాష్, అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్గా సుమిత్కుమార్, తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్గా మాధవీలత, కాకినాడ జిల్లా కలెక్టర్గా కృతికా శుక్లాను నియమించింది.
కోనసీమ జిల్లా కలెక్టర్గా హిమాన్షు శుక్లా, పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్గా పి. ప్రశాంతి, ఏలూరు జిల్లా కలెక్టర్గా ప్రసన్న వెంకటేశ్ , కృష్ణా జిల్లా కలెక్టర్గా రంజిత్ బాషా ,ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్గా ఎస్. దిల్లీరావును నియమించింది . గుంటూరు జిల్లా కలెక్టర్గా వేణుగోపాల్రెడ్డి , పల్నాడు జిల్లా కలెక్టర్గా శివశంకర్, బాపట్ల జిల్లా కలెక్టర్గా విజయ, ప్రకాశం జిల్లా కలెక్టర్గా దినేశ్కుమార్ నెల్లూరు జిల్లా కలెక్టర్గా చక్రదర్ బాబు, చిత్తూరు జిల్లా కలెక్టర్గా హరినారాయణ , బాలాజీ జిల్లా కలెక్టర్గా వెంకటరమణా రెడ్డి, కడప జిల్లా కలెక్టర్గా విజయరామరాజును ప్రభుత్వం నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
అన్నమయ్య కలెక్టర్గా గిరీష, అనంతపురం కలెక్టర్గా ఎస్. నాగలక్ష్మి, సత్యసాయి జిల్లా కలెక్టర్గా పి. బసంత్కుమార్, కర్నూలు కలెక్టర్గా కోటేశ్వరరావు. నంద్యాల కలెక్టర్గా మనజీర్ జిలానీని నియమించింది.