అమరావతి: ఆంధ్రప్రదేశ్ తాడేపల్లిలోని సోషల్ వెల్ఫేర్ గురుకుల కళాశాలలో ప్రవేశాలకు ప్రభుత్వం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది. 2022-23 విద్యా సంవత్సరానికిగాను డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గురుకుల కళాశాలలు, ఐఐటీ / నీట్ అకాడమీలలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం (ఏపీజీపీసెట్-2022) ప్రవేశాల కోసం అర్హులైన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలి. ఈ మేరకు శుక్రవారం నోటిఫికేషన్ విడుదలైంది.
ఈ నోటిఫికేషన్ ప్రకారం, విద్యార్థులు 2022 లో మొదటి ప్రయత్నంలో SSC ఉత్తీర్ణులై ఉండాలి. వారి సంబంధిత జిల్లాల్లోని గురుకుల పాఠశాలలకు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. తెలుగు మీడియం చదివిన విద్యార్థులు కూడా అర్హులే. విద్యార్థి వయస్సు 2011 ఆగస్ట్ 31 నాటికి 17 సంవత్సరాలు మించకూడదు. ప్రవేశ పరీక్షలో పొందిన మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు. ఆసక్తి గల అభ్యర్థులు 2022 మార్చి 31 లోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంట్రెన్స్ ఏప్రిల్ 24న ఉండే అవకాశాలు ఉన్నాయి.