అమరావతి : ఆంధ్రప్రదేశ్లోని ఏలూరు జిల్లా నూజివీడు రాజీవ్గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నా లజీస్లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతూ ఏపీ ప్రభుత్వం నోటిఫికేషన్ను విడుదల చేసింది . 2022-23 విద్యా సంవత్సరానికి గాను రెండేళ్ల పీయూసీ, నాలుగేళ్ల బీటెక్ కోర్సుల్లో ప్రవేశాలకు ఏదైనా గుర్తింపు పొందిన బోర్డు లేదా ఇన్స్టిట్యూట్ నుంచి మొదటి ప్రయత్నంలోనే పదో తరగతిలో ఉత్తీర్ణత సాధించి ఉన్న విద్యార్థులు ఈనెల 19వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించింది .
దరఖాస్తుల్లో వచ్చిన సర్టిఫికేట్ల వెరిఫికేషన్ సెప్టెంబర్ 27 నుంచి 30 తేదీలోపు కొనసాగుతుందన్నారు. ప్రొవిజనల్ సెలక్షన్ లిస్టు 29న విడుదల చేస్తామని వెల్లడించారు. అక్టోబర్ 17 నుంచి క్లాసులు ప్రారంభమవుతాయని వివరించారు. విద్యార్ధులు ఎవరైనా ఆర్జీయూకేటీలో ప్రవేశాలు పొందడానికి ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు.
దరఖాస్తు సమయంలో జనరల్ అభ్యర్ధులు రూ.250లు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్ధులు రూ.150లు అప్లికేషన్ ఫీజు చెల్లించవల్సి ఉంటుందన్నారు. అకడమిక్ మెరిట్, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా విద్యార్ధులకు సీటు కేటాయింపు ఉంటుందని తెలిపారు.