అమరావతి : రేపటి నుంచి 12వ తేదీ వరకు ఏపీఈఏపీసెట్-2022 పరీక్షల నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఏపీ ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ ప్రవేశాల కోసం ఏపీలో 120 కేంద్రాలు, తెలంగాణలో రెండు సెంటర్లు ఏర్పాట్లు చేశారు. 4వ తేదీ నుంచి 8 వరకు ఇంజినీరింగ్ పరీక్ష, 11 నుంచి 12 వరకు అగ్రికల్చర్, పార్మసీ పరీక్ష జరుగుతుందని ఏపీ విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి శ్యామలరావు, రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ హేమచంద్రారెడ్డి వెల్లడించారు.
ఈ పరీక్షలు రాసేందుకు 3 లక్షల 84వేల మంది దరఖాస్తు చేసుకొన్నారని తెలిపారు. నిమిషం ఆలస్యమైనా పరీక్ష కేంద్రంలోకి పంపరాదనే నిబంధన అమలవుతుందని తెలిపారు. ఆర్టీసీ బస్సులు, మెడికల్ సెంటర్లు ఏర్పాటు చేయాలని ఆదేశించామని పేర్కొన్నారు. విద్యార్థులు తప్పనిసరిగా మాస్క్ ధరించాలని, ఏమైనా సందేహాలు ఉంటే 08554-234311,232248 హెల్ప్లైన్ నంబర్లకు ఫోన్ చేసి నివృత్తి చేసుకోవచ్చని వివరించారు. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు తప్పకుండా కుల ధ్రువీకరణ పత్రాలు తెచ్చుకోవాలని సూచించారు.