అమరావతి : రోజులు గడుస్తున్నా కొద్ది ఏపీలో కొవిడ్ కేసులు పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 14,502 కొత్త కేసులు రికార్డవగా.. వైరస్ ప్రభావంతో ఏడుగురు మృతి చెందారు. 24గంటల్లో 4,800 మంది బాధితులు కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం ఏపీలో యాక్టివ్ కేసులు 93,305 యాక్టివ్ కేసులున్నాయి. తాజాగా కేసులతో మొత్తం కేసుల సంఖ్య 21,95,136కు పెరిగింది. ఇందులో 20,87,282 మంది బాధితులు కోలుకున్నారు.
మహమ్మారి బారినపడి మొత్తం 14,549 మంది ప్రాణాలు కోల్పోయారు. కొత్త కేసుల్లో అత్యధికంగా విశాఖపట్నంలో 1,728 మందికి వైరస్ పాజిటివ్గా తేలింది. ఆ తర్వాత అనంతపురంలో 1610, ప్రకాశంలో 1579, కర్నూల్లో 1551, వైఎస్సార్ కడపలో 1492, నెల్లూరులో 1198 మందికి వైరస్ పాజిటివ్గా నిర్ధారణ అయ్యిందని ఆరోగ్యశాఖ విడుదల చేసిన బులిటెన్లో పేర్కొంది. కొత్తగా 40,266 మందికి కొవిడ్ పరీక్షలు నిర్వహించినట్లు వివరించింది. కొవిడ్ కారణంగా పశ్చిమ గోదావరిలో ఇద్దరు, గుంటూరు, కర్నూలు, నెల్లూరు, శ్రీకాకుళం, విశాఖపట్నంలో ఒక్కొక్కరు మృతి చెందారని తెలిపింది.