అమరావతి : నూతన సంవత్సర వేడుకల సందర్భంగా ఆంధ్రప్రదేశ్లో ఒక్కరోజే రూ.120 కోట్ల మద్యం విక్రయాలు జరిగాయి. లక్షా 89,606 మద్యం కేసులు విక్రయించినట్లు ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ అధికారులు వెల్లడించారు. ఒక రోజు మద్యం అమ్మకాల్లో ఇదే రికార్డు అమ్మకాలని తెలిపారు. 2019లో రాష్ట్రంలో నిలిపివేసిన ప్రిమియం మద్యం అమ్మకాలను తిరిగి ప్రారంభించిన రోజునే భారీ స్థాయిలో అమ్మకాలు జరిగాయని పేర్కొన్నారు.
ప్రతిరోజు రాష్ట్రవ్యాప్తంగా 70 నుంచి 80 కోట్ల రూపాయల విలువ గల మద్యం విక్రయాలు కొనసాగుతుండగా గత 5 రోజులుగా వంద కోట్ల మార్కును దాటుతూ వస్తుంది. ఇక నూతన సంవత్సర వేడుకల సందర్భంగా దాదాపు 40 కోట్ల రూపాయల అదనంగా మద్యం విక్రయాలు జరిగాయి. రిటైల్ అవుట్లెట్స్, బార్లకు డిసెంబర్ 31 రాత్రి అదనంగా మరో గంట విక్రయాలకు అనుమతి ఇవ్వడం కూడా విక్రయాల పెరుగుదలకు కారణమని అధికారులు వెల్లడించారు.