Bus Fire Accident | ఏపీలోని విజయనగరం జిల్లాలో ప్రైవేటు ట్రావెల్స్ బస్సు అగ్ని ప్రమాదానికి గురైంది.రామభద్రాపురం మండలం తారాపురం వద్ద బస్సులో నుంచి మంటలు చెలరేగాయి. దీంతో బస్సు పూర్తిగా దగ్ధమైంది. భువనేశ్వర్ నుంచి మల్కాన్గిరి వెళ్తుండగా వెనుక టైర్ పేలడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.
బస్సు వెనుక టైర్ పేలి మంటలు అంటుకోవడంతో అప్రమత్తమైన డ్రైవర్.. వెంటనే ప్రయాణికులను దించేశాడు. దీంతో పెను ప్రమాదం తప్పింది. ఘటన సమయంలో బస్సులో మొత్తం 42 మంది ప్రయాణికులు ఉండగా.. ఎవరికీ ఏ గాయం కాలేదు. అయితే బస్సు మాత్రం పూర్తిగా దగ్ధమైంది. ప్రమాద సమయంలో ఒడిశాకు చెందిన ఒక ఎమ్మెల్యే కూడా ప్రయాణం చేస్తున్నట్లు సమాచారం.
కాగా, బస్సు ప్రమాదం గురించి సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది వెంటనే అక్కడకు చేరుకుని మంటలను ఆర్పివేశారు. ఇక పోలీసులు కూడా ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. ప్రయాణికులను ప్రత్యామ్నయ మార్గాల్లో గమ్యస్థానాలకు పంపించేశారు.
ఏపీలో మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు
విజయనగరం జిల్లా రామభద్రపురం మండలం తారాపురం వద్ద మంటల్లో కాలిపోయిన ఒడిశాకు చెందిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు
బస్సు వెనుక టైర్ నుండి మంటలు రావడం గమనించిన డ్రైవర్.. నిద్రలో ఉన్న ప్రయాణికులను లేపి కిందకి దింపడంతో తప్పిన ప్రాణాపాయం… pic.twitter.com/xfDVBFBgV7
— Telugu Scribe (@TeluguScribe) March 21, 2026