అమరావతి : ఆంధ్రప్రదేశ్లో పోలీసులు అత్యుత్సాహాన్ని తగ్గించుకోవాలని టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు డిమాండ్ చేశారు. చట్టవిరుద్ధంగా వ్యవహరిస్తున్న పోలీసుల చిట్టాను తయారు చేస్తున్నా మని అన్నారు. ప్రతిపక్ష నేతలు, కార్యకర్తలను సీఎం వేధిస్తున్నారని మండిపడ్డారు. అక్రమ కేసులతో ఎంత మందిని జైలుకు పంపారో లెక్కలేదని ఆరోపించారు. వైసీపీ పాలనలో ఇబ్బందిపడిన కార్యకర్తలకు టీడీపీ అండగా ఉంటుందని పేర్కొన్నారు.
కొంతమంది పోలీసులు వైసీపీతో కమ్ముక్కై అక్రమ కేసులు పెడుతున్నా రని , అర్ధరాత్రి అరెస్టులు, థర్డ్ డిగ్రీలతో కార్యకర్తలను వేధిస్తున్నారని ఆరోపించారు. టీడీపీ కార్యకర్తల కన్నీళ్ల కు కారణమైన పోలీసులు, వైసీపీ నేతలను వదిలే ప్రసక్తే లేదని హెచ్చరించారు. చంద్రబాబు సీఎంగా ప్రమాణం చేసిన తొలిరోజు నుంచే చర్యలకు ఉపక్రమిస్తామని వెల్లడించారు.
కాగా విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ విశాఖలోని జీవీఎంసీ గాంధీబొమ్మ వద్ద దీక్షకు సిద్ధమైన టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు వేణుగోపాల్తో పాటు పలువురు టీడీపీ నాయకులను పోలీసులు అరెస్టు చేసి స్టేషన్కు తరలించారు. దీంతో స్టేషన్లోనే దీక్షలు కొనసాగిస్తున్నారు.