అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో ఉగాది నుంచి కొత్త జిల్లాలో పాలన ప్రారంభం అవుతుందని ఏపీ గవర్నర్
బిశ్వభూషణ్ హరిచందన్ పేర్కొన్నారు. ఈ రోజు నుంచి ప్రారంభమైన బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ ఉభయ
సభలనుద్ధేశించి ప్రసంగించారు. 2020-2021 ఏడాదికి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ 16.82 శాతం సమగ్ర వృద్ధి
సాధిస్తుందని అన్నారు. గత మూడేళ్లుగా వికేంద్రీకృత, సమ్మిళిత పాలన ఉండేలా ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల్లో మెరుగైన అభివృద్ధి సాధిస్తుందని తెలిపారు.
రాష్ట్ర తలసరి ఆదాయం రూ. 2,04,758 కోట్లు వస్తుందన్నారు. గ్రామీణ ప్రాంత రోడ్ల అభివృద్ధి కోసం రూ.6,400 కోట్లను ఖర్చు చేస్తుందని, 3వేల కి.మీ పొడవున 2 లైన్ల రోడ్లను అభివృద్ధి చేస్తుందన్నారు. మన బడి నాడు-నేడు కింద ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి చేపడుతుందని వెల్లడించారు. పార్లమెంటరీ నియోజకవర్గానికి ఒకటి చొప్పున కొత్తగా 16 మెడికల్ కళాలలను నెలకొల్పుతుందని వివరించారు.
రైతు భరోసా కింద ప్రతి రైతుకు రూ.13,500లను ఆర్థిక సహాయం కింద ప్రభుత్వం అందిస్తుందన్నారు. 2023 జూన్ నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు.