అమరావతి : వాయువ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడింది . అల్పపీడనం ప్రభావంతో కోస్తా, యానాం జిల్లాల్లో వర్షాలు పడుతాయని వాతావరణ శాఖ (Meteorological ) వెల్లడించింది. శుక్రవారం నుంచి 21 వ తేదీ వరకు కోస్తా ( Kosta) జిల్లాలో ఉరుములు(Thunder), మెరుపుల (Lightning) తో కూడిన వర్షాలు పడే అవకాశముందని తెలియజేసింది. కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించింది.
తీరం వెంబడి 30-40 కి. మీ వేగంతో ఈదురు గాలులు వీస్తాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని సూచించారు. శ్రీకాకుళం, పార్వతీపురం, తూర్పుగోదావరి, కృష్ణా, గుంటూరు, కాకినాడ, విజయనగరం, తదితరు జిల్లాలో తేలికపాటి జల్లులు కురిసాయి. నిన్న రాత్ని గుంటూరు జిల్లా రావెల ప్రాంతంలో అత్యధికంగా 8 సెం.మీ వర్షం నమోదయింది.