అమరావతి : కుప్పం ప్రజలు నారా చంద్రబాబు చెర నుంచి విముక్తులయ్యారని, ప్రస్తుతం ఆ నియోజకవర్గ ప్రజలు జనజీవన స్రవంతిలోకి వచ్చారని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. బుధవారం వెలువడ్డ స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాల అనంతరం ఆయన మాట్లాడారు. కుప్పం ప్రజలు వైఎస్సార్సీపీని భారీ మెజారిటీతో గెలిపించినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఎన్నికల్లో గెలుపొందేందుకు చంద్రబాబు ఎన్ని నాటకాలు ఆడినా ప్రజలు నమ్మలేరని వెల్లడించారు.
ఏపీలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చూసి సీఎం జగన్కు, ప్రభుత్వానికి వరుస ఎన్నికల్లో ప్రజలంతా మద్దతు తెలుపుతున్నారని వివరించారు. పలు ఎన్నికల్లో టీడీపీకి జనసేన బహిరంగంగానే మద్దుతు ఇచ్చిందని , 100 స్థానాల్లో ఎన్నికలు జరిగితే 97 శాతం స్థానాల్లో తాము విజయం సాధించామని సజ్జల పేర్కొన్నారు.