నంద్యాల: ఆంధ్రప్రదేశ్లోని నంద్యాలలో ఓ పోలీస్ కానిస్టేబుల్ దారుణ హత్యకు గురయ్యాడు. విధులు ముగించుకుని ఇంటికి వెళ్తున్న కానిస్టేబుల్ను అటకాయించిన దుండగులు కత్తితో పొడిచి హత్యచేశారు. కానిస్టేబుల్ గూడూరు సురేంద్రకుమార్.. నంద్యాల పట్టణంలోని డీఎస్పీ కార్యాలయంలో క్లర్క్గా పనిచేస్తున్నారు. ఆదివారం రాత్రి 10.30 గంటల సమయంలో విధులు ముగించుకుని బైక్పై ఇంటికి వెళ్తున్నారు. అయితే రాజ్ థియేటర్ సమీపంలో ఆరుగురు దుండగులు సురేంద్రను అటకాయించి ఆటోలో కిడ్నాప్ చేశారు.
అక్కడి నుంచి పట్టణ శివారులోని చెరువుకట్టపైకి తీసుకెళ్లారు. అక్కడ సురేంద్ర గుండెలపై, వీపులో కత్తితో పొడిచి హత్య చేశారు. అదే ఆటోలో పట్టణంలోకి తిరిగి వస్తూ కానిస్టేబుల్ను దవాఖానకు తీసుకెళ్లాలని డ్రైవర్కు చెప్పి.. మధ్యలో దిగి వెళ్లిపోయారు. సురేంద్రను దవాఖానకు తీసుకెళ్లగా.. అప్పటికే మరణించడాని వైద్యులు నిర్ధారించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. నిందితుల కోసం గాలింపు చేపట్టారు. సంఘటన జరిగిన ప్రాంతాన్ని జిల్లా ఎస్పీ రఘువీర్ రెడ్డి పరిశీలించారు. కాగా, కానిస్టేబుల్ హత్యకు కారణాలు తెలియాల్సి ఉంది.