అమరావతి: ఆంధ్రప్రదేశ్లో నేడు నూతన కేబినెట్ (Cabinet) కొలువుదీరనుంది. 25 మంది కొత్త మంత్రులతో రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ సోమవారం ఉదయం 11.31 గంటలకు ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. దీనికోసం తాత్కాలిక సచివాలయం మొదటి బ్లాకు పక్కన ప్రత్యేకంగా వేదికను సిద్ధం చేశారు. 2019లో అధికారంలోకి వచ్చిన సీఎం జగన్.. 25 మందితో మంత్రివర్గాన్ని ఏర్పాటు చేశారు. అయితే ముందుగా చెప్పినట్లు వారందరితో ఈనెల 7న రాజీనామా చేయించారు. కొత్తవారితో నూతన కేబినెట్ను ఏర్పాటు చేశారు.
అయితే 11 మంది సీనియర్లకు మంత్రివర్గంలో మరోసారి అవకాశం ఇచ్చారు. వారిలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి, బొత్స సత్యనారాయణ, పినిపె విశ్వరూప్, గుమ్మనూరి జయరాం, చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ, సీదిరి అప్పలరాజు, తానేటి వనిత, నారాయణస్వామి, అంజాద్ బాషా, ఆదిమూలపు సురేష్ ఉన్నారు.
కొత్తగా 14 మందిని నియమించనున్నారు. వారిలో ధర్మాన ప్రసాదరావు, రాజన్న దొర, గుడివాడ అమర్నాథ్, ముత్యాలనాయుడు, దాడిశెట్టి రాజా, కారుమూరి నాగేశ్వరరావు, కొట్టు సత్యనారాయణ, జోగి రమేష్, అంబటి రాంబాబు, మేరుగ నాగార్జున, విడదల రజని, కాకాణి గోవర్ధన రెడ్డి, ఆర్కే రోజా, ఉషా శ్రీచరణ్లు ఉన్నారు.