నల్లగొండ: ఆంధ్రప్రదేశ్లోని అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్సీకి తృటిలో ప్రమాదం తప్పింది. ప్రొద్దుటూరుకు చెందిన వైసీపీ ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ ప్రయాణిస్తున్న కారును.. నార్కట్పల్లి సమీపంలోని గోపలాయపల్లి స్టేజ్ వద్ద మరో కారు ఢీకొట్టింది. దీంతో ఆయన కారు ధ్వంసమయింది. అయితే రమేష్ యాదవ్ స్వల్ప గాయాలతో సురక్షితంగా బయటపడ్డారు. గుంటూరులో జరిగిన వైసీపీ ప్లీనరీ సమావేశాలకు హాజరై.. హైదరాబాద్ వస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. ఎమ్మెల్సీని మరో కారులో హైదరాబాద్ తరలించామన్నారు.