అమరావతి: ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్రెడ్డి హఠాన్మారణం పట్ల ఏపీ మంత్రులు అనిల్ యాదవ్, సురేష్, ప్రభుత్వ సలహదారుడు సజ్జల రామకృష్ణా రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. గౌతమ్రెడ్డి మరణాన్ని ఊహించుకోలేక పోతున్నామని వారు అన్నారు. వివాదాలకు దూరంగా ఉంటే సహచరుడు లేని లోటును పార్టీపరంగా వ్యక్తిగతంగా తీర్చలేనిదని వారు అన్నారు .
గౌతమ్రెడ్డి మృతదేహాన్ని రేపు (మంగళవారం) ఎయిర్ అంబులెన్స్లో నెల్లూరు జిల్లాకు ప్రజల సందర్శనార్థం తీసుకెళ్లనున్నామని వెల్లడించారు. ఎల్లుండి నెల్లూరు నుంచి స్వగ్రామం బ్రాహ్మణపల్లి వరకు అంతిమ యాత్రను నిర్వహిస్తామన్నారు. గౌతమ్రెడ్డి అంత్యక్రియల్లో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాల్గొంటారని వారు వివరించారు.