అమరావతి : ఏపీ రవాణాశాఖ మంత్రి పినిపే విశ్వరూప్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. అమలాపురంలో మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్రెడ్డి వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం ఆయన అస్వస్థతకు గురయ్యారు. ఛాతీలో నొప్పి రావడంతో కిందపడిపోయారు. దీంతో ఆయనను అమలాపురంలోని కిమ్స్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. మెరుగైన చికిత్స కోసం రాజమహేంద్రవరంలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి స్థిరంగానే ఉందని వైద్యులు తెలిపారు.