అమరావతి : విశాఖ జిల్లా శారదామఠం వద్ద విధులు నిర్వహిస్తున్న పోలీసు అధికారిపై అసభ్యకర వ్యాఖ్యలు చేసినమంత్రి అప్పలరాజు బహిరంగ క్షమాపణ చెప్పాలని ఏపీ పోలీసు అధికారుల సంఘం నాయకులు డిమాండ్ చేశారు. సీఎం పర్యటన సందర్భంగా పోలీసు అధికారులు నిక్కచ్చిగా బందోబస్తు నిర్వహించాల్సి ఉంటుందని అటువంటి తరుణంలో మంత్రి వాహనాన్ని ఆపిన పోలీసు అధికారిపై మంత్రి, అనుచరులు అనుచిత వ్యాఖ్యలు చేశారని మండిపడ్డారు.
ఈ సంఘటనపై సీఎం విచారణ జరిపించాలని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జె.శ్రీనివాసరావు, కోశాధికారి ఎం. సోమశేఖర్రెడ్డి, విజయవాడ, పశ్చిమగోదావరి శాఖల అధ్యక్షులు సోమయ్య, నాగేశ్వరరావు విడుదల చేసిన ప్రకటనలో డిమాండ్ చేశారు.